సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏ సమయనా ఎలా అడుతుందో ఎవ్వరికి తెలియడం లేదు. బెంగుళూరు టీంతో ఇక్కడే ఆడిన మ్యాచ్లో 200 స్కోర్ చేంజ్ చేసి ఔరా అనిపించింది. వార్నర్, బెయిర్ స్టో సెంచరీలు సాధించిమరి జట్టుకు విజయాన్ని అందించారు. కాని ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. 137 పరుగులు చేయలేక ఘోర ఓటమిని మూటగట్టుకుంది.
శనివారం రాత్రి ఉప్పాల్ వేదికగా ముంబైతో తలపడింది సన్రైజర్స్ హైదరాబాద్ఘ మొదట బ్యాంటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. పొలార్డ్ (46) మాత్రమే రాణించాడు. 137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ 17.4 ఓవర్లలో 96 పరుగులకే ఆలౌటైంది. దీపక్ హుడా చేసిన 20 పరుగులే టాప్ స్కోర్ అంటే జట్టు పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విండీస్ బౌలర్ అల్జారి జోసెఫ్ ఈ మ్యాచ్తో ఐపీఎల్ల్లో అరంగేట్రం చేశాడు. అల్జారి జోసెఫ్ 12 పరుగులే ఇచ్చి ఏకంగా 6 వికెట్లతో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్లను పెవిలియన్కు చేర్చాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అల్జారి జోసెఫ్కే దక్కింది.