బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తాజాగా నటిస్తున్న చిత్రం భరత్. సల్మాన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న భరత్ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి కత్రినా కైఫ్ సల్మాన్ సరసన నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు చిత్ర యూనిట్. సినిమాలో సల్మాన్ ఖాన్ ఐదు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. దీనికి సంబంధించిన సన్నివేశాలను కూడా ట్రైలర్లో చూపించారు.
కత్రినా కైఫ్ ఈ సినిమాలో అధికారిణిగా కనిపించనుంది. భారత్ అనే వ్యక్తి దేశంతో కలిసి చేసిన ప్రయాణం ఎలాంటిదనే కాన్సెప్ట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ సల్మాన్ చెల్లెలుగా నటిస్తుంది.రంజాన్ కానుకగా జూన్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం భరత్ ట్రైలర్ యూట్యూబ్ను షేక్ చేస్తోంది.