ఉదయం ప్రారంభం అయిన అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్గా జరగుతున్నాయి. టీడీపీ నేత అచ్చెన్నాయుడు, మంత్రి అనీల్కుమార్ యాదవ్ల మధ్య నీరు-చెట్టు ప్రాజెక్టు మాటల యుద్ధం జరిగింది. నీటి బొట్టులేకుండా నీడ నిచ్చే చెట్టు లేకుండా టీడీపీ నేతలు రూ. 80వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు అంచానాలను టీడీపీ పెంచిదని అనిల్ అన్నారు. ధర్మపోరాట దీక్ష పేరులో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అందుకే ఆ పార్టీనుంచి 23 మందే గెలిచారన్నారు. వీదందరూ అలీ బాబా 23 దొంగలు’ అని విమర్శలు చేశారు.
టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో సమర్థవంతమైన పాలన అందించిందని, కాని కొన్ని కారణాల వల్ల ఓడిపోయామని అచ్చెన్నాయుడు చెప్పారు. దీనికి స్పందించిన మంత్రి అనిల్ పైవిధంగా జవాబిచ్చారు.పోలవరానికి 24 పర్మీషన్లు అవసరమైతే 23 పర్మీషన్లను తీసుకొచ్చిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిదేని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. నేడు పోలవరం ప్రాజెక్టు కొనసాగడానికి కారణం కూడా వైఎస్సారేనని తెలిపారు.