న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్లో టీ మిండియా 18 పరుగుల తేడాతో ఓడింది. అయితే క్రీజులో జడేజా, ధోని ఉండటంతో విజయంపై ఆశలు చిగురించాయి. జడేజా అవుట్ అయినా కూడా క్రీజులో ధోని ఉన్నాడనే భరోసా.. మిస్టర్ కూల్ మళ్లీ మేజిక్ చేయకపోతాడా? తనదైన స్టైల్లో మ్యాచ్ను ఫినిష్ చేయకపోతాడా..? అన్న ఆసక్తి. అందుకు తగ్గట్టే 48 ఓవర్ తొలి బంతిని ధోనీ స్టాండ్స్లోకి పంపించడంతో అందరిలోనూ ఆశలు రెట్టింపయ్యాయి. కానీ.. విధి వక్రీకరించింది.. ఆ ఓవర్లో మూడో బంతికి రెండో పరుగుకు ప్రయత్నించి గప్టిల్ డైరెక్ట్ త్రోకు రనౌట్ అయ్యాడు. ధోని అవుట్తో కోట్ల మంది ఆశలు కుప్పకూలిపోయాయి.
అంతే… స్టేడియం మొత్తం నిశ్శబ్దం.. రనౌట్ అంటూ థర్ట్ అంపైర్ ప్రకటన.. ఒక్కసారిగా ధోని భావోద్వేగానికి గురయ్యాడు. జట్టు కష్ట సమయాల్లోనూ ఎంతో నిబ్బరంగా, ఎలాంటి భావోద్వేగాలను ప్రదర్శించకుండా కూల్గా ఉండే మహేంద్రుడు ఒక్కసారికి కంట తడి పెట్టాడు. భావోద్వేగాలకు ఆపుకోలేక క్రీజును వీడుతూనే ఏడ్చేశాడు.. జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయానే.. అనుకుంటూ భారంగానే పెవిలియన్ వైపు అడుగులు వేశాడు.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.