రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. పధకాలను సాధించిన క్రీడాకారులకు మరిన్ని నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహిస్తే ప్రతి ఒక్కరూ పీవీ సింధూలవుతారని ఆయన అభిప్రాయపడ్డారు. 29న క్రీడల దినోత్సవ సందర్భంగా వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అదికారులకు సూచించారు.
2014 రాష్ట్ర విభజన తర్వాత.. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన మన రాష్ట్ర క్రీడాకారులకు నగదు పోత్సాహకాలు ఇద్దాం. బంగారు పతకం సాధించిన వారికి రూ.5లక్షలు, వెండి పతకం సాధించిన వారికి రూ.4లక్షలు, కాంస్యం గెలుచుకున్న వారికి రూ.3 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు.
జూనియర్, సబ్ జూనియర్ స్థాయి క్రీడాకారులనూ గుర్తించాలి. ఈ కేటగిరీలో జాతీయ స్థాయిలో బంగారు పతకం వచ్చిన వారికి రూ.1.25లక్షలు, వెండిపతకం సాధిస్తే రూ.75వేలు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.50 వేలు ఇవ్వనున్నట్లు జగన్ తెలిపారు.