కొత్తగా నిర్మాణం రంగంలోకి అడుగుపెట్టడం.. మిడిల్ క్లాస్ అబ్బాయ్ (ఎంసీఏ) సినిమా కూడా విడుదలవుతుండడంతో న్యాచురల్ స్టార్ నాని టెన్షన్గా ఉన్నారు. తాను కొత్తగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి వాల్ పోస్టర్ అనే బ్యానర్ను ప్రారంభించాడు. ఆ బ్యానర్పై తీస్తున్న సినిమా అ!. తన సినిమా కన్నా ఈ సినిమాపై టెన్షన్ పడుతున్నారు. కొంచెం రిలాక్స్ కోసం నాని తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నాడు.
ఆదివారం వీఐపీ ప్రారంభ దర్శనంలో నాని, తన భార్య అంజన, కుమారుడు అర్జున్ దర్శించుకున్నారు. అయితే అ!, ఎంసీఏ సినిమాలను విజయంతం కావాలనే ఉద్దేశంతో వచ్చి ఉంటారని తెలుస్తోంది. దర్శనం అనంతరం ఆలయం బయటకు వచ్చిన అనంతరం విలేకరులతో నాని మాట్లాడారు. కుమారుడితో వెంకన్నను దర్శనం చేసుకోవడం బాగుందని చెప్పాడు. నాని కోసం భక్తులు, అభిమానులు ఎగబడ్డారు. ఆటోగ్రాఫ్, ఫొటోల కోసం పోటీపడ్డారు.