భాగమతితో ఆకట్టుకుంటున్న అనుష్క పెట్రోల్ బంక్లో కనిపించింది. పెట్రోల్ విక్రయిస్తూ సందడి చేసింది. అగ్ర కథానాయికగా దూసుకెళ్తున్న అనుష్క మానవతా దృక్పథం, సేవాతత్వం చాటుతోంది. నలుగురికి సహాయం చేయడానికి అనుష్క పెట్రోల్ అమ్మారు. మంచు లక్ష్మి ‘మేము సైతం’ షోకు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షో సీజన్ -1 గతేడాది పూర్తయ్యింది. ఇప్పుడు రెండో సీజన్ను ప్రారంభం సందర్భంగా అనుష్క పెట్రలో అమ్మాయిరు.
‘రేపటి నుంచి ‘మేము సైతం’ సీజన్ 2 షూటింగ్ ప్రారంభం కాబోతోంది. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. ఆదివారం ఉదయం 10 గంటలకు ఫిల్మ్నగర్ రోడ్ నంబర్-1లో అనుష్క విరాళాలు సేకరించనున్నారు. వెళ్లి సాయం చేయండి’ అని మంచు లక్ష్మీట్విట్టర్లో ప్రకటించింది. అనుకున్నమాదిరిగానే ఆదివారం (ఫిబ్రవరి 4న) అనుష్క ఫిల్మ్నగర్లోని పెట్రోల్ బంక్లో పెట్రోల్ అమ్మి, విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా అనుష్క అభిమానులు, ప్రజలతో ఫొటోలు దిగుతూ సందడి చేసింది. అనుష్క క్యాప్ ధరించి, పెట్రోల్ విక్రయించే వారి దుస్తులు వేసుకున్నారు. అందరికీ పెట్రోల్ పోశారు. అనుష్క వచ్చిందనే విషయం తెలుసుకున్న ప్రేక్షకులు పెద్ద ఎత్తున వచ్చారు.
మంచు లక్ష్మీ ‘మేముసైతం’ కార్యక్రమం ద్వారా కష్టాల్లో ఉన్నవారికి, పేదలకు సాయం చేస్తున్నారు. ఇప్పుడు రెండో సీజన్ ప్రారంభించడంతో అనుష్క కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొంది. సీజన్-1లో రానా, రకుల్ప్రీత్ సింగ్, సమంత, శ్రియ, నాని, నాగచైతన్య, లావణ్య త్రిపాఠి తదితరులు పాల్గొని సేవా కార్యక్రమాల్లో చేశారు.