విజయ్ దేవరకొండ వరస సినిమాలు చేస్తు బిజీగా ఉన్నాడు.అతను నటించిన గీతా గోవిందం సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక సినిమా తరువాత టాక్సీవాలా, ‘నోటా’.. ‘డియర్ కామ్రేడ్ సినిమాలు లైన్లో ఉన్నాయి.తాజాగా డైరెక్టర్ క్రాంతి మాధవ్ విజయ్కు ఓ కథ వినిపించాడని తెలుస్తుంది.కథ నచ్చడంతో విజయ్ దేవరకొండ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.ఇక ఈ సినిమాలో హీరోయిన్గా రాశీ ఖన్నాని తీసుకున్నారుటా.
రాశీ ఖన్నాకు వరస హిట్లు రావడంతో పాటు ఆమె నటనలో కూడా చాలా పరిణితి చెందడంతో ఆమెను ఈ సినిమాలో తీసుకున్నారటా. విజయ్ – క్రాంతి మాధవ్ సినిమా ఒక మంచి ఫీల్ ఉన్న లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందట. రియల్ లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా క్రాంతి మాధవ్ ఈ సినిమా కథ తయారు చేసుకున్నాడని సమాచారం. సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై KS రామారావు నిర్మిస్తారట. అక్టోబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెడతారని సమాచారం.