కుమారి 21 ఎఫ్ సినిమాతో కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టింది హెబ్బా పటేల్.ఈ సినిమాలో టాలీవుడ్లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా హెబ్బా ఉంటుందని అందరు భావించారు.అయితే వరుస ఫ్లాప్లు రావడంతో రేస్లో వెనుక పడింది.దీంతో ఆమె ఓ అడల్డ్ కంటెంట్తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది హెబ్బా పటేల్.‘24 కిస్సెస్’ అంటూ మరోసారి ముద్దుల వర్షం కురిపిస్తోంది. హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ జంటగా నటిస్తోన్న ఈ సినిమా ట్రైలర్ వచ్చేసింది. ‘24 కిస్సెస్’ సినిమా ఉపశీర్షిక ‘నీకో సగం.. నాకో సగం.. ఈ ఉత్సవం’. దీనికి తగ్గట్టుగానే మూవీలో ముద్దుల ఉత్సవం జరిపించారు. ట్రైలర్ చూస్తే ఇదే విషయం అర్థమవుతోంది. హెబ్బా పటేల్ తనదైన అందచందాలను ఆరబోస్తూ మరోసారి కనువిందు చేస్తోంది.
అల తానై అలరించేది మగువా.. తనువు తానై మురిపించేది మగువా.. ఒడి తానై మనిషినే మలిచేది మగువా.. నింగినైనా.. నేలనైనా అమూల్యమైనది మగువా..’ అంటూ ప్రేమదేశంలోని సూపర్ హిట్ పాటతో 24 కిస్సెస్ సినిమా ట్రైలర్ ప్రారంభమైంది. హెబ్బా పటేల్, అరుణ్ మధ్య సన్నివేశాలు హాట్ హాట్గా తెరకెక్కించారు. ఫస్ట్ కిస్ అంటూ మత్తెక్కిస్తున్న హీరో అదిత్.. ‘కానీ, అది నాకు కాదు.. తనకు’ అంటూ కవ్విస్తుండగా.. ‘ఇంతకీ నువ్ నన్ను ప్రేమిస్తున్నావా? లేదా?’ అంటూ హీరోయిన్ నిలదీస్తోంది. ‘అన్ని బంధాలకు ఏదో ఒక పేరు పెట్టాల్సిందేనా’ అంటూ అదిత్ ఎదురు ప్రశ్నిస్తున్నాడు. బోల్డ్ స్టోరీలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్లుగా నిలవడంతో ,ఈ సినిమా ఎన్నో ఆశలు పెట్టుకుంది హెబ్బా పటేల్.మరి ఈ సినిమా హెబ్బాకు హిట్ ఇస్తుందో లేదో చూడాలి.