యువ హీరో శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన తాజా చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫామిలీ డైరెక్టర్ కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. దాంతో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా భారీ అంచనాలు మధ్య విడుదలైంది.
ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సినిమాకు నెటిజన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వస్తోంది. కొంతమంది బాగుంది అని కామెంట్లు చేస్తే.. మరికొంత మంది మాత్రం యావరేజ్ అని కామెంట్లు చేస్తున్నారు. రొటీన్ కథకు కామెడీ, రొమాన్స్ జతచేసి చూపించారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఫస్టాఫ్ బాగుందని, సెకండాప్ యావరేజ్ అని చాలా మంది ఫాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. బెటర్ ఎండింగ్ ఉంటే బాగుండేదని నెటిజన్లు అంటున్నారు.
మొత్తంగా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా ‘గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్’ అని చెప్పొచ్చు. పెళ్లి చేసుకోవాలనుకున్న ఓ అబ్బాయికి తన కుటుంబంలోని మహిళల వలన పెళ్లి సెట్ కాకపోవడం, తనకు నచ్చిన అమ్మాయికి అతడు నచ్చకపోవడం, ఆమెను ఒప్పించేందుకు ఆ అబ్బాయి చేసే ప్రయత్నాలను డైరెక్టర్ చూపించాడు. శర్వానంద్ నటన, రష్మిక అందం, దేవిశ్రీ సంగీతం సినిమాకు అదనపు బలం.