సినీ నటుడు జగపతి బాబు రాజకీయాల్లోకి వస్తారని ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే.గతంలో ఆయన వైజాగ్లో ఓ ర్యాలీ కూడా నిర్వహించారు.అప్పటి నుంచే జగపతి బాబు రాజాకీయాలలోకి వస్తారని వార్తలు వచ్చాయి.అయితే తాజాగా ఆయన త్వరలోనే అధికార టీడీపీ పార్టీలో చేరనున్నారని తెలుస్తుంది.ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది. ఈ వార్తలను నిజం చేస్తు జగపతి బాబు మంగళవారం ఉదయం ఏపీ రాజధాని అమరావతిలో చంద్రబాబుని కలిశారు. జగపతిబాబు ఇలా ప్రత్యేకంగా వచ్చి చంద్రబాబుని కలవడం వెనక ఏదో రాజకీయ కోణం ఉండే ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పైగా టీడీపీ ఎమ్మెల్యే, చంద్రబాబు బావమరిది బాలకృష్ణకి జగపతిబాబు బాగా క్లోజ్ అన్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలోనే జగపతిబాబు టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలను కొట్టిపరేస్తున్నారు జగపతి బాబు సన్నిహితులు.జగపతిబాబు ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారని.. ఆయనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన కూడా లేదని చెబుతున్నారు. జగపతి బాబు తన ఇంట్లో జరిగే ఫంక్షన్కు చంద్రబాబుని ఆహ్వానించడానికి మాత్రమే సచివాలయానికి వచ్చారని చెబుతున్నారు. ఏదీ ఏమైనప్పటికి జగపతి బాబు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్గా మారారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.