Saturday, April 20, 2024
- Advertisement -

హీరో రామ్ ఇంట విషాదం!

- Advertisement -

గత ఏడాది నుంచి తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో పలువురు సెలబ్రెటీలు కన్నుమూస్తున్నారు. తాజాగా హీరో పోతినేని తాతయ్య కన్నుమూశారు. ఈ సందర్భంగా రామ్ భావోద్వేగంతో ఒక ట్వీట్ పెట్టారు. తన తాతయ్య ఒక సామాన్యమైన స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన తీరును గుర్తు చేసుకున్నాడు.

విజయవాడలో ఒక లారీ డ్రైవర్ గా ప్రస్థానం మొదలు పెట్టిన తన తాతయ్య ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఎంతో ఎత్తుకు ఎదిగారని అన్నారు. ఎప్పుడూ తన కుటుంబం గురించి ఆలోచించే తన తాతయ్య కుటుంబానికి అన్ని వసతులు, సౌకర్యాలను అందించేందుకు ఆరోజుల్లో మీరు లారీ టైర్లపైనే నిద్రించేవారని గుర్తుచేసుకున్నాడు. డ్రైవర్ స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకు ఎదిగిన మీ జీవితం మాకు ఎన్నో పాఠాలను నేర్పిందని అన్నాడు.

మీ పిల్లలందరూ ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారంటే దానికి మీరే కారణమని తెలిపాడు. డబ్బులు ఉన్న ప్రతి వ్యక్తి ధనవంతుడు కాలేడని మంచి మనసున్న వాడే నిజమైన ధనవంతుడు అన్న సత్యాన్ని తమకు తెలిపిన గొప్ప మనిషి అన్నారు రామ్. మీ మరణం తనను కలచి వేస్తోందని.. తన హృదయం ముక్కలైందని ఆవేదన వ్యక్తం చేశాడు. తన తాతయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పాడు.

జబర్ధస్త్ సుడిగాలి సుధీర్ ఇంట విషాదం..

ఆక్సిజన్ అందక తల్లిని కోల్పోయిన టాలీవుడ్ డైరెక్టర్

నేటి పంచాంగం,మంగళవారం(18-05-2021)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -