ఈ మధ్య హీరో హీరోయిన్స్ తమ అభిమానులతో డైరెక్ట్ గా మాట్లాడేస్తున్నారు. సోషల్ మీడియా వాడకం బాగా పెరగడంతో.. హీరో హీరోయిన్స్ ఫ్యాన్స్ తో మాట్లాడం కోసం ఆసక్తి చూపిస్తున్నారు. వారితో లైవ్ చాట్ చేస్తూ ఆనంద పరుస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఫెస్ బుక్ లైవ్ లో అభిమానులతో ముచ్చటించాడు.
వారు అడిగే ప్రశ్నలకి సమాధానమిస్తూ ప్రస్తుతం చేస్తున్న జవాన్ సినిమా త్వరలోనే రిలీజ్ చేస్తానని. మరి కొన్ని రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి చెబుతాని చెప్పాడు. విలన్ పాత్రలు చేయడానికి సిద్ధమేనని, పవన్కల్యాణ్ సినిమాలో చిన్న రోల్ వచ్చినా నటిస్తానని తెలిపాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి తనకు దేవుడితో సమానమని, ఆయన వల్లే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని చెప్పాడు. రవి తేజ – ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని , అలాగే మహేష్ అన్న అంటే కూడా చాలా ఇష్టమని ‘ఈ తరానికి ఆయన సూపర్ స్టార్ అని చెప్పాడు.
ఇక, `తొలి ప్రేమ సినిమాను రీమేక్ చేస్తారా` అనే ప్రశ్నకు సమాధానంగా అలాంటి క్లాసీ సినిమాలు నేను చేయలేన`ని చెప్పాడు. మీరు సినిమాల్లోకి ఎందుకు వచ్చారు అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. నిరుద్యోగం, వేరే అవకాశాల్లేకపోవడం వల్లే హీరోగా మారానని చెప్పుకొచ్చాడు.