హాస్య నటుడిగా ఎన్నో సినిమాల్లో అలరించిన నటుడు సునీల్ ఇప్పుడు హీరోగా మారాడు. కానీ ఆశించిన విజయాలు మాత్రం అందుకోలేకపోయాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్నే అంతో ఇంతో ఆడిన సినిమాగా నిలిచింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో హీరోగా నటించిన సునీల్కు కలిసిరాలేదు. ఆ సినిమాలు విడుదలయ్యాయ అని అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతలా సునీల్ సినిమాలు వచ్చి వెళ్లిపోయాయి. కానీ ప్రేక్షకుల ఆదరణ నోచుకోలేదు.
హాస్య నటుడిగా రాణిస్తున్న సమయంలోనే హీరోగా మారాడు. ఒకటి రెండు సినిమాలు మంచి విజయాలు సాధించినా.. స్టార్ ఇమేజ్ అందుకునే స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో తిరిగి హాస్య నటుడిగా లేదా ప్రత్యేక పాత్రలో మెరిసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. ఇందులో భాగంగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజతో తీస్తున్న సినిమాలో సునీల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడట. అయితే ఆ పాత్ర హాస్య నటుడిగానా? లేదా సహాయ నటుడిగా నటిస్తున్నాడో తెలియదు. సునీల్ మాదిరి శ్రీనువైట్ల కూడా కష్టాల్లో ఉన్నాడు. శ్రీనువైట్ల అతడి సినిమాలు అంతగా ఆడలేదు. వరుస పరాజయాలు పొందాడు. ఇప్పుడు వీరద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఇద్దరికి కలిసి వస్తుందో లేదో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమా రానుంది.
ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కబోయే సినిమాలో సునీల్ కీలక పాత్రలో నటించనున్నాడు. అంతకంటే ముందు సునీల్ నటించిన సినిమా 2 కంట్రీస్ డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.