Friday, April 19, 2024
- Advertisement -

ఇలాంటి పనులు ఎందుకు చేస్తారు అంటూ నటి ఫైర్..?

- Advertisement -

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఈ పరిస్థితుల నుంచి బయటపడడం కోసం ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే “బంగారం” నటి మీరా చోప్రా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం కోసం ఏకంగా ఫ్రంట్ లైన్ వారియర్ గా తప్పుడు గుర్తింపు కార్డును సంపాదించిందని నటిపై భాజపా నేత నిరంజన్‌ ఆరోపించారు. ఈ క్రమంలోనే నెటిజన్లు పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ విధంగా తనపై వస్తున్న తప్పుడు ఆరోపణలు పై తీవ్రంగా స్పందించిన నటి మీరాచోప్రా తను వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రయత్నిస్తున్న మాట నిజమే కానీ ఈ విధంగా తప్పుడు ఐడెంటి కార్డులను గుర్తించి వ్యాక్సిన్ వేయించుకోవాలని తనేప్పుడు భావించలేదని తీవ్రంగా ఖండించారు.

ప్రతి ఒక్కరు తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలి.ఈ క్రమంలోనే గత నెలనుంచి వ్యాక్సిన్ కోసం తాను ఎంతగానో పోరాడుతున్నానని చివరికి వ్యాక్సిన్ వేయించుకోవడానికి రిజిస్ట్రేషన్ చేయించుకుని తన ఆధార్ కార్డ్ సమర్పించానని తెలిపారు.ఈ క్రమంలోనే ఎవరో నా ఫోటోతో మార్ఫింగ్ చేసి ఈ విధమైనటువంటి తప్పుడు గుర్తింపు కార్డును తయారు చేశారు.మనం ఏదైనా మన గుర్తింపు కార్డును ఇచ్చినప్పుడు తప్పకుండా ఆ కార్డుపై సంతకం చేస్తారని, కానీ ఈ గుర్తింపు కార్డు పై తన సంతకం లేదని ఆరోపించారు.

Also read:ఆ వివాదం పై సమంత స్పందించక పోవడానికి కారణం అదే!

తనకి ఆధార్ కార్డు తప్ప మరే గుర్తింపు కార్డు లేదని, కొందరు కావాలనే ఇలా ఎందుకు చేస్తారో అంటూ ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా మీరాచోప్రా ఎన్టీఆర్ అంటే ఎవరో తనకు తెలియదని చెప్పడంతో తీవ్ర విమర్శల పాలైంది. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు వరుసకు సోదరైన మీరా చోప్రా ప్రస్తుతం పలు బాలీవుడ్ వెబ్ సిరీస్ లో, సినిమాలో నటిస్తున్నారు.

Also read:ప్రేయసి కోసం రూ.23 కోట్ల విలువచేసే విల్లా కొన్న స్టార్ హీరో?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -