దేశంలో కరోనా ఉధృతి మరీ ఘోరంగా తయారైంది. రోజుకి మూడు లక్షల కేసులు నమోదు అవుతున్నాయి. కరోనాతో సెలబ్రెటీలు వరుసగా కన్నుమూస్తున్నారు. ఇప్పటికే నటుడు వివేక్, పొట్టి వీరయ్య వంటి ప్రముఖ నటులు కన్నుముసారు. ఆ సంగతి మరవకముందే మరో ప్రముఖ సినీ ప్రముఖుని కరోనా బలి తీసుకుంది. ఒకప్పుడు తన అందచందాలతో తెలుగుప్రేక్షకులను మెప్పించిన నటి మాలాశ్రీ భర్త ప్రముఖ నిర్మాత రాము(52) కరోనాతో కన్నుమూసారు.
కన్నడలో పలు భారీ చిత్రాలను నిర్మించారు. రాము కి వారం క్రితం కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఈయన బెంగుళూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం సాయంత్రం కన్నుమూసారు. కన్నడ చిత్ర సీమలో పలు భారీ చిత్రాలను ముఖ్యంగా తన భార్య మాలాశ్రీతో పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు.
సాయి కుమార్ హీరోగా ఏకే 47, లాకప్ డెత్, కలాసి పాళ్య లాంటి బ్లాక్ బస్టర్స్ సినిమాలను నిర్మించారు. దాదాపు 40 చిత్రాల వరకు నిర్మించారు. మాలాశ్రీ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాము మృతిపై కన్నడతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
చేతి నరాలు కట్ చేసుకొని మాలీవుడ్ నటుడు ఆత్మహత్యాయత్నం!
మాల్దీవ్స్ సర్కార్ నిర్ణయంతో సెలబ్రిటీలకు షాక్… నవ్వుకుంటున్న నెటిజన్లు!