Friday, April 26, 2024
- Advertisement -

కరోనా కాటుకు బాలీవుడ్ నటి బలి

- Advertisement -

దేశం వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ప్రతీ రోజు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. పాజిటివ్‌ కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రముఖ బాలీవుడ్ న‌టి అభిలాషా పాటిల్ క‌రోనా వైర‌స్‌కు గురై చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. గ‌త మూడు రోజులుగా క‌రోనాకు చికిత్స తీసుకుంటున్న అభిలాష.. ఆరోగ్య ప‌రిస్థితి విషమించ‌డంతో బుధ‌వారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన ‘చిచోర్’ సినిమాతో అభిలాషా పాటిల్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అభిలాషా పాటిల్ కు భర్త, కొడుకు ఉన్నారు. మరాఠీ సీరియల్ ‘బాప్ మనుస్’ తో పాటు ప‌లు సీరియ‌ళ్ల‌లో ఆమె నటించారు. ప్ర‌స్తుతం బనారస్‌లో ఉన్న అభిలాషా నాలుగైదు రోజులుగా క‌రోనా వైర‌స్ జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న‌ది.

దాంతో ఆమెను మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు ఆమె కుటుంబ‌స‌భ్యులు ముంబైకి తీసుకొచ్చారు. అక్క‌డ కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ముంబయిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ఆమె చనిపోయారు. అభిలాషా పాటిల్ మృతిపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.

ఇంట్లోనే అలాంటి పని చేస్తూ చెమటోడుస్తున్న సురేఖా వాణి.. వైరల్!

తొడకొట్టి డ్యాన్స్ చేసిన బుల్లితెర మెగాస్టార్ కూతురు.. వైరల్ వీడియో!

ఫోటో షూట్ లతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ భామ..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -