- Advertisement -
క్రిమినల్ సినిమాలో నాగర్జున సరసన నటించిన మనీషా కోయిరాల బొంబాయి, భారతీయుడు, దిల్ సే వంటి పలు హిట్ సినిమాలతో హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత ఆమె 2010లో సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.
అతను నేపాల్ కి చెందిన పెద్ద బిజినెస్ మేన్. అయితే పెళ్లైన రెండు సంవత్సరాలికే అభిప్రాయ బేధాలు రావడంతో 2012లో వారిద్దరూ విడిపోయారు. విడిపోయిన తర్వాత కేన్సర్ బారిన పడ్డ ఆమె న్యూయార్క్ హాస్పటల్ లో కీమో ధెరపీ చేయించుకుంది. ఆ సమయంలో ఆమె దిగిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కేన్సర్ జయించిన ఆమె ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుని వారితో సరదాగా గడుపుతోంది. మనీషా త్వరలోనే ఓ హిందీ సినిమా ద్వారా బాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది.
{youtube} t6ZSvz-DfNM{/youtube}