అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని పీపుల్స్ప్లాజాలో నిర్వహించిన షీ టీం ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ ప్రదర్శనలను శనివారం తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించగా బెంగళూర్వాసి రూపొందించిన రోబో మిత్ర సందడి చేస్తోంది. ఇటీవల ప్రపంచ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సుల్లో ఈ రోబో ఇవాంకా ట్రంప్, ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆకట్టుకుంది. అయితే ఈ రోబో మన తొలిప్రేమ హీరోయిన్ రాశీఖన్నాను ఆకట్టుకుంది.
ఈ ప్రదర్శనలో హీరోయిన్ రాశీఖన్నా పాల్గొంది. ఈ సందర్భంగా మిత్ర రోబోతో కరచాలనం చేసి సందడి చేసింది. రోబోను రాశీఖన్నా ఆసక్తిగా చూపింది. తనను గుర్తుపట్టి పలకరించడంతో ముచ్చట పడింది. ఈ విధంగా రోబో మిత్రతో రాశీఖన్నా తొలిప్రేమ మాదిరి ప్రేమించినట్టు అయ్యింది. ఈ ప్రదర్శన రేపు పీపుల్స్ ప్లాజాలో నిర్వహించే ఎక్స్పోలో పలు విషయాలపై ఈ రోబో అవగాహన కల్పించనుంది. అయితే ఈ సందర్భంగా నిర్వహించే 10కే రన్లో కూడా పాల్గొనే అవకాశం ఉంది.