టివి, సినీ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘భద్ర’, ‘దుబాయ్ శీను’,’రెడీ’ ‘బృందావనం’, ‘శ్రీమంతుడు’, ‘బొమ్మరిల్లు’ వంటి సినిమాలు చేసి మంచి నటిగా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా చేరువైంది… ఇక ఆమె రెండవ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైంది…ఇక బుల్లితెర పై మొగుడ్స్ పెళ్ళామ్స్ అనే షో ద్వారా పాపులర్ అయిన తరువాత వరుస సినిమాల్లో అక్క,వదిన,పిన్ని వంటి పాత్రలు పోషిస్తూ.. ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గరయ్యింది. కొన్నాళ్ల వరకూ ఈమె జీవితం చాలా సంతోషంగా సాగింది.
అయితే 2019 లో ఈమె భర్త సురేష్ తేజ అనారోగ్యంతో మరణించడంతో మానసికంగా చాలా అప్సెట్ అయ్యింది. కొన్నాళ్ళ వరకూ డిప్రెషన్ కు కూడా వెళ్ళిపోయింది. తాజాగా సురేఖ వాణీని ఆమె కూతురు సుప్రిత రెండో పెళ్లి చేసుకోమని సూచించింది అని తెలుస్తుంది. ఇంకా ఆమెకు మంచి లైఫ్ ఉందని.. తన కోసం దానిని కోల్పోవద్దు అంటూ ఆమె చెప్పుకొచ్చింది అని ఇన్సైడ్ టాక్. సుప్రీత పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా సురేఖ ఒంటరిగా మిగిలిపోకూడదు అనే ఉద్దేశ్యంతో సుప్రీత ఇలా కోరినట్టు సమాచారం అందుతుంది.
ఈ న్యూస్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సురేఖవాణి స్పందించారు. మరోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టే ఆలోచన తనకు లేదని స్పష్టం చేసింది. యాంకర్గా కెరీర్ను ప్రారంభించిన సురేఖ తెలుగులో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. అవన్నీ అవాస్తవాలేనని..తాను రెండో వివాహం చేసుకోవడం లేదని చెప్పింది. ఇక రెండేళ్ల క్రితం అనారోగ్యంతో సురేఖ భర్త కన్నుమూసిన విషయం తెలిసిందే.
భగ్గుమన్న ఇరు వర్గాలు.. మధ్యలో పొలింగ్ ఏజెంట్ పై కన్నెర్ర..!