నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం మట్లూరు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఒకే పార్టీకి చెందిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు బరిలో నిలిచారు.
పోలింగ్ ఏకపక్షంగా నిర్వహించుకునే ఉద్దేశంతో ఓ వర్గం వారు.. పోలింగ్ ఏజ్ంట్పై దాడికి పాల్పడ్డారు. దీంతో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయగా.. స్థానికులు అడ్డుకున్నారు5, 7 పోలింగ్బూత్ల్లోకి చొరబడి ఏజెంట్లపై మరో వర్గం వ్యక్తులు దాడులకు తెగబడ్డారు.
ప్రహరీ గోడ దూకి వచ్చి దాడి చేస్తున్నా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారని బాధితులు ఆరోపించారు. దాడిలో ఓ వ్యక్తి గాయపడగా.. మరో ఏజెంట్ను పెట్టుకునేందుకు ఉన్నతాధికారులు అనుమతించారు. ఏజెంట్పై దాడి చేసిన వారిని శిక్షించాలని.. మరో వర్గం వారు ఆందోళన చేపట్టారు.ఘటనలో గాయపడ్డ ఏజెంట్ బాబురావును ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
నిర్మల్ జిల్లాలో వింత ఎన్నిక.. వార్డు సభ్యురాలు అపహరణ..!