Friday, April 26, 2024
- Advertisement -

అజిత్ సినీ ప్రస్థానానికి 30 ఏళ్లు .. వైరల్ గా మారిన ‘తల’ పోస్ట్..!

- Advertisement -

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ సినీ ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన తన అభిమానులు, ద్వేషించే వాళ్లు, న్యూట్రల్ గా ఉండే వాళ్లను ఉద్దేశించి చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమిళనాడులో నేటి తరం హీరోల్లో అజిత్ నెంబర్ వన్ రేసులో ఉన్నారు. అభిమానులు అతడిని ముద్దుగా ‘తల’ అని పిలుచుకుంటుంటారు. తమిళనాడులో హీరో అజిత్ విజయ్ మధ్య తీవ్ర పోటీ ఉంటుంది. తరచూ వీరిద్దరి హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని ఒకరినొకరు ట్రోల్స్ చేసుకుంటూ ఉంటారు.

విజయ్ ఫాన్స్ అజిత్ ను ఉద్దేశించి కామెంట్స్ చేస్తుంటారు. అలాగే అజిత్ ఫ్యాన్స్ కూడా విజయ్ పై చెలరేగుతుంటారు. ఈ నేపథ్యంలో తాను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అజిత్ ఓ పోస్ట్ చేశాడు. అజిత్ తన పోస్టులో ‘ ఫ్యాన్స్, హెటర్స్, న్యూట్రల్స్ ఒకే నాణేనికి ఉన్న మూడు ముఖాన్నిల్లాంటివారు. ఫ్యాన్స్ పంచే ప్రేమ, హేటర్స్ ద్వేషం, న్యూట్రల్స్ గా ఉండే వారి అభిప్రాయాలను నేను స్వీకరిస్తా. లివ్ అండ్ లెట్ లివ్. ఆల్వేస్ అన్ కండిషనల్ లవ్ ‘ అని ఉన్న ఓ సందేశాన్ని అజిత్ మేనేజర్ అజిత్ ఫ్యాన్స్ ట్విట్టర్ పేజీలో షేర్ చేశాడు.

తనను ప్రేమించే వారితో పాటు ద్వేషించే వారి అభిప్రాయాలు స్వీకరిస్తా అని అజిత్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ద్వేషించే వారిని కూడా యాక్సెప్ట్ చేయడం అజిత్ కే సాధ్యం అని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అజిత్ వినోద్ దర్శకత్వంలో వలిమై అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల కానుంది.

Also Read

హరిహర వీరమల్లు నుంచి స్పెషల్ సర్ప్రైజ్.. 

మెగాస్టార్ చెల్లెలిగా కీర్తి సురేష్..!

మరో విలక్షణ పాత్రలో సత్యదేవ్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -