Friday, March 29, 2024
- Advertisement -

మెగాస్టార్ చెల్లెలిగా కీర్తి సురేష్..!

- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న అన్నాత్తే సినిమాలో ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ రజినీకాంత్ కి చెల్లెలిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సారి ఇంకో స్టార్ హీరో సినిమాలో కీర్తి సురేష్ చెల్లెలిగా కనిపించనుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో తమిళ మూవీ వేదాళం రీమేక్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరో తో పాటు హీరో చెల్లెలికి కూడా ప్రాధాన్యం ఉంటుందట. దీంతో ఆ పాత్రలో ఓ పేరున్న హీరోయిన్ ను తీసుకోవాలని మేకర్స్ భావించారు.

సాయి పల్లవిని కాని కీర్తి సురేష్ ను గాని ఆ పాత్రకు తీసుకోవాలని అనుకున్నారు. ముందుగా ఈ సినిమా కథను కీర్తి సురేష్ కు వినిపించగా .. ఆమెకు నచ్చడంతో ఈ సినిమాలో నటించేందుకు కీర్తి సురేష్ అంగీకారం తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ రెండు పాటలు మినహా పూర్తయింది. ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదల కానుంది.

ఆచార్య సినిమాలో చిరంజీవి తో పాటు మరో కీలక పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. చరణ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఆచార్య కాకుండా ప్రస్తుతం చిరంజీవి చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. తమిళ వేదాళం రీమేక్ తో పాటు యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఆచార్య తర్వాత ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ముందు సెట్స్ పైకి వెళుతుందో తెలియాల్సి ఉంది.

Also Read

విడుదలకు ముందే ఏకే రికార్డ్స్..!

బన్నీ బాలీవుడ్ ఎంట్రీకి ఆ రెండు సినిమాలే అడ్డు..!

ప్రభాస్ హోమ్ ప్రొడక్షన్ లో రామ్ చరణ్ సినిమా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -