- Advertisement -
హీరో అక్కినేని అఖిల్ ఆదివారం తన పుట్టినరోజు జరుపుకొన్నారు.ఈ సందర్భంగా ఆయన ఇండస్ట్రీలో అతికొద్ది మందిని తన బర్త్డే పార్టీకి ఆహ్వనించినట్లు తెలుస్తుంది.నటీమణులు మంచు లక్ష్మి, రకుల్ప్రీత్ సింగ్ తదితరులు పార్టీకి హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా అతిథులతో కలిసి సమంత, నాగచైతన్య, అఖిల్ దిగిన ఫొటోలంటూ సోషల్మీడియాలో కొన్ని చక్కర్లు కొడుతున్నాయి.అఖిల్ నటించిన రెండు సినిమాలు అనుకున్నంత సక్సెస్ కాలేదు.
ప్రస్తుతం ఆయన తన తర్వాతి సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ‘తొలిప్రేమ’ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ నూతన ప్రాజెక్టుకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాను ప్రారంభించారు. అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు వరుణ్తేజ్, సాయిధరమ్ తేజ్, కాజల్, కల్యాణి ప్రియదర్శన్ తదితరులు సోషల్మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు.