హైదరాబాద్: టాలీవుడ్ బడా హీరో అక్కినేని నాగార్జున తనయులు నాగచైతన్య, అఖిల్ పెళ్లి విషయం ఇప్పుడు బాగా పాపులర్. మొదట్లో సైలెంట్గా నడిచి తర్వాత బహిరంగమైన ఈ విషయాలపై అందరికీ ఆసక్తి ఏర్పడింది. అన్నదమ్ములిద్దరి ప్రేమ వ్యవహారం ఒకేసారి లీకవ్వడంతో అందరూ ఆశ్చర్యపడ్డారు. అయితే ఇరువురి పెళ్లి ఎలా జరగనుందనేది ఇప్పుడు తాజా సస్పెన్స్. చైతూ, సమంతల పెళ్లి 2017లో జరగనుందని స్వయంగా చైతూనే వెల్లడించాడు.
అది అలా ఉండగా అంతా అనుకున్నట్టుగానే యంగస్టార్ అఖిల్ పెళ్లి ఇటలీలోనే జరగనుంది. ఫ్యాషన్ డిజైనర్ శ్రేయా భూపాల్తో అఖిల్ మ్యారేజ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే నాగార్జున దంపతులు అఖిల్ పెళ్లిని నిరాడంబరంగా, హడావుడి లేకుండా జరపాలని భావిస్తుండగా, శ్రేయా పేరెంట్స్ మాత్రం ఘనంగా జరపాలని కోరుకుంటున్నారట. దీంతో ఇరువురికి ఆమోదయోగ్యమైన విధంగా ఇటలీలో పెళ్లి చేయాలని నిర్ణయించారు పెద్దలు.
యూరప్లో పలు ప్రాంతాలను పరిశీలించి చివరికి రోమ్ను ఫైనల్ చేసినట్టు సమాచారం. దీంతో అఖిల్ తన పెళ్లి తెలుగు వారి మధ్య కాకుండా ఎక్కడో దూరంగా చేసుకుని తెలుగు వారిని నిరుత్సాహ పరచనున్నాడన్నమాట. అయితే మన మీడియావారు ఏదో విధంగా మనకు టీవీల్లో చూసే అవకాశం కల్పిస్తారులెండి.
Related