Friday, May 3, 2024
- Advertisement -

నాగార్జున‌తో వ‌ర్మ సినిమా ముహుర్తం ఖ‌రారు

- Advertisement -

సంచలనాలు సృష్టించే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ త‌న త‌దుప‌రి సినిమా ఎప్పుడూ ప్రారంభ‌మ‌వుతుందో ప్ర‌క‌టించాడు. అక్కినేని నాగార్జునతో తెరకెక్కించే సినిమా ముహూర్తం ఈ నెల 20వ తేదీన హైద‌రాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో 10. 30 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఈ సినిమాను వర్మ తల్లి, త‌న‌కు కెరియ‌ర్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచిన‌ శివ సినిమా నిర్మాతలు అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర ప్రారంబిస్తారట.

శివ సినిమాతోనే రామ్‌గోపాల్ వ‌ర్మ త‌న సినీ ప్ర‌యాణాన్ని ప్రారంభించాడు. ఆ త‌ర్వాత ఎన్నో విజ‌యాలు, విమ‌ర్శ‌లు, వాగ్వాదాలు జ‌రిగాయి. అవ‌న్నీ ఆయ‌న స్టైల్ ఆఫ్ వ‌ర్క్ అంతే. నాగార్జునతో తీసిన శివ సినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఆ సైకిల్‌ చైన్ సీన్ అయితే అభిమానుల‌కు, ప్ర‌జ‌ల‌కు తెగ న‌చ్చేసింది. ఆ సినిమాకు సీక్వెల్‌ను ఇప్పుడు తీస్తున్నార‌ని స‌మాచారం. ఈ సినిమాలో కింగ్ నాగార్జున పోలీస్ అధికారిగా కనిపిస్తాడట. త్వరలోన్ మరిన్ని వివరాలు తెలియచేస్తారట. ఇత‌ర న‌టీనటుల వివ‌రాల త‌దిత‌ర వెల్ల‌డి కాలేదు. అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో ఈ చిత్రం రానుంది.

https://www.youtube.com/watch?v=gxawzb9Kwts

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -