Saturday, May 4, 2024
- Advertisement -

’నా పేరు సూర్య” సినిమా ఉమైర్ సంధు రివ్యూ

- Advertisement -

‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా సినిమా మే 4న భారీగా రిలీజ్ అయ్యేందుకు సిద్దంగా ఉంది. తాజాగా ఆడియో, ప్రీ రిలీజ్ వేడుకలతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా విడుద‌ల‌కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. రంగ‌స్థ‌లం, భ‌ర‌త్ అనే నేను సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ఇప్పుడ బార్డ‌ర్‌లో బ‌న్నీ తూటా పేల్చేందుకు సిద్ధ‌మ‌య్యారు.

ఈ సినిమా ఖ‌శ్చితంగా హిట్ అవుతుంద‌నీ అభిమానులు భారీ అంచ‌నాల‌తో ఉన్నారు. వారి మాట‌ల‌కు బ‌లాన్ని చేకూర్చే విధంగా సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు సెన్సార్ ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు పెద్ద సినిమాలన్నింటినీ విడుదలకు ముందే దుబాయ్‌లో చూసేసి సంధు రివ్యూలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ‘నా పేరు సూర్య’ సినిమాను కూడా ఆయన చూసేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

‘ఓవర్సీస్ సెన్సార్ బోర్డు వద్ద నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా చూశాను. చాలా బాగా తెరకెక్కించారు. సింప్లీ మైండ్‌బ్లోయింగ్. అల్లు అర్జున్ నటన తారాస్థాయిలో ఉంది. ‘రంగస్థలం’, ‘భరత్ అనే నేను’ తరహాలో తెలుగులో మరో బ్లాక్‌బస్టర్ వస్తోంది’ అని ఉమైర్ సంధు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

గ‌తంలో కొన్ని సినిమాలు రివ్యూకు వ్య‌తిరేకంగా ఫ‌లితాలు వ‌చ్చాయి. అయితే ‘రంగస్థలం’, ‘భరత్ అనే నేను’ సినిమాల విషయంలో ఆయన చెప్పిందే నిజమైంది. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్లని విడుదలకు ఒకరోజు ముందే సంధు రివ్యూ ఇచ్చారు. ఆయన అన్నట్టుగానే ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించాయి. ఇప్పుడు ‘నా పేరు సూర్య’ విషయంలో కూడా అదే నిజమవుతుందేమో చూడాలి.

అల్లు అర్జున్, అను ఇమ్మానుయేల్ జంటగా నటించిన ఈ చిత్రం మే 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకాబోతోంది. సినిమా ద్వారా రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాస్ సహ నిర్మాతగా కె.నాగబాబు సమర్పమణలో ఈ సినిమా తెరకెక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -