తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కొత్తగా 65,923 శాంపిల్స్ టెస్ట్ చేయగా 4,826 మందికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,36,619కి చేరింది. కరోనా వల్ల సామాన్యుల నుంచి సెలబ్రెటీలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కొంత మంది కరోనా వల్ల కన్నుమూస్తున్న విషయం తెలిసిందే. గత నెలలో వరుసగా దర్శక, నిర్మాతలు చనిపోయారు. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా మెగా ఫ్యామిలీ పై పడిందనే చెప్పొచ్చు.
నాగబాబు, పవన్ కళ్యాన్, రామ్ చరణ్, అల్లు అర్జున్, కళ్యాన్ దేవ్ ఇలా వరుస పెట్టి మరీ కరోనా భారిన పడ్డారు. ఇక అల్లు అర్జున్కు రెండు వారాల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి క్వారంటైన్లో ఉంటూ ఆయన చికిత్స తీసుకున్నాడు. తనకు నెగెటివ్ నిర్ధారణ అయిందంటూ బన్నీ ఈ రోజు ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు.
‘ప్రతి ఒక్కరికీ హాయ్.. 15 రోజుల క్వారంటైన్ తర్వాత నాకు కరోనా నెగెటివ్ నిర్ధారణ అయింది. నా క్షేమాన్ని కోరిన ప్రతి ఒక్కరికీ ధనవ్యాదాలు.. లాక్ డౌన్ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. అందరూ సురక్షితంగా ఇంట్లోనే ఉండండి. మీరు చూపిస్తోన్న ప్రేమకు కృతజ్ఞతలు ’ అని బన్నీ ట్వీట్ చేశాడు.