అందం, అభినయంతో బుల్లితెరపై తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నయాంకర్, నటి అనసూయ భరద్వాజ్. జబర్ధస్త్ కతర్నాక్ కమెడీ షో ద్వారా బల్లితెర ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. సినిమాల్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. ప్రస్తుతం బుల్లితెరతో పాటు వెండితెరపై రైయ్ రైయ్ మంటూ దూసుకుపోతోంది అనసూయ.
ఆ మధ్య కాలంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో రంగమ్మత్త పాత్ర పోషించి.. అనసూయ అనే కంటే రంగమ్మత్త అంటేనే గుర్తుపట్టే రేంజిలో నటించింది. ఈ సినిమాతో ఈ అమ్మడి కెరియర్ మరో మలుపు తిరిగిందని చెప్పాలి. అప్పటి నుంచి సినిమా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ సినిమాలో వేశ్యగా నటించబోతోంది.
మారుతి డైరెక్షన్లో గోపీచంద్ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. పక్కా కమర్షియల్ అనే టైటిల్ ను చిత్ర యూనిట్ ఖరారు చేసింది. అయితే, ఈ సినిమాలో అనసూయ వేశ్య పాత్రలో కనిపించనుందని సమాచారం. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో రాబోతున్న ఈ సినిమాను జీఏ-1 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాశీ ఖన్నా, ఈషా రెబ్బాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
సడన్ గా వ్యాయామం మానేస్తే.. ఏం జరుగుతుంది?