Monday, April 29, 2024
- Advertisement -

ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్.. ‘వేశ్య’గా యాంకర్‌ అనసూయ!

- Advertisement -

అందం, అభిన‌యంతో బుల్లితెర‌పై త‌న కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నయాంక‌ర్, న‌టి అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌. జ‌బ‌ర్ధ‌స్త్ క‌త‌ర్నాక్ క‌మెడీ షో ద్వారా బ‌ల్లితెర ప్రేక్ష‌కుల‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ‌.. సినిమాల్లో వ‌చ్చిన అవకాశాల‌ను స‌ద్వినియోగం చేసుకున్నారు. ప్ర‌స్తుతం బుల్లితెర‌తో పాటు వెండితెర‌పై రైయ్ రైయ్ మంటూ దూసుకుపోతోంది అన‌సూయ‌.

ఆ మ‌ధ్య కాలంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ సినిమాలో రంగ‌మ్మ‌త్త పాత్ర పోషించి.. అన‌సూయ అనే కంటే రంగ‌మ్మ‌త్త అంటేనే గుర్తుప‌ట్టే రేంజిలో న‌టించింది. ఈ సినిమాతో ఈ అమ్మ‌డి కెరియ‌ర్ మ‌రో మ‌లుపు తిరిగింద‌ని చెప్పాలి. అప్ప‌టి నుంచి సినిమా అవ‌కాశాలు ఆమెను వెతుక్కుంటూ వ‌స్తున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ సినిమాలో వేశ్య‌గా న‌టించ‌బోతోంది.

మారుతి డైరెక్ష‌న్‌లో గోపీచంద్ హీరోగా ఓ సినిమా తెర‌కెక్క‌బోతోంది. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ అనే టైటిల్ ను చిత్ర యూనిట్ ఖ‌రారు చేసింది. అయితే, ఈ సినిమాలో అన‌సూయ వేశ్య పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం. అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రాబోతున్న ఈ సినిమాను జీఏ-1 పిక్చ‌ర్స్, యూవీ క్రియేష‌న్స్ క‌లిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాశీ ఖ‌న్నా, ఈషా రెబ్బాలు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

స‌డన్ గా వ్యాయామం మానేస్తే.. ఏం జ‌రుగుతుంది?

ప‌ద్యాలొస్తే.. ఫ్రీ పెట్రోల్!

పిచ్చెక్కిస్తున్న రొమాంటిక్ సీన్స్!

మాస్టర్ సాంగ్ కు చిందులేసిన‌ అశ్విన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -