యాంకర్ అనసూయ ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది. ఒకవైపు టీవీ షోలు మరోవైపు వరుస సినిమాలను సమానంగా బాలన్స్ చేస్తోంది. బుల్లితెరపై హాట్ యాంకర్గా తనదైన గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. క్షణం సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత రంగస్థలంలో రంగమ్మత్తగా నటించి అందరి మన్ననలు పొందింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కృష్ణ వంశి రంగ మర్తాండ, రవితేజ ఖిలాడి సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ భామ ఫెవరెటిజం నోరు విప్పింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనసూయ ఫెవరెటిజం గురించి మాట్లాడుతూ…‘ఎందుకో టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలియని ఫెవరెటిజం ఉంటుంది. అందుకు కారణంగా షూటింగ్ ప్యాకప్ చెప్పేసిన తర్వాత చేసే నెట్వర్కింగ్ కారణమని చెప్పాలి. దాని ప్రభావంతోనే ఫెవరెటిజం ప్రభావం చూపుతుంది. దీని కారణంగా చాలా సందర్భాల్లో అవకాశాలు మన చేతికి వచ్చినట్లే చేజారిపోతుంటాయి.
నేను కూడా ఫెవరెటిజం కారణంగా అకాశాలను పోగొట్టుకున్నాను. నాలుగు పెద్ద సినిమాలకు సంబంధించి ఆడిషన్స్ ఇచ్చాను. డైరెక్టర్స్ చాలా మెచ్చుకున్నారు. అయితే కొన్నిరోజుల తర్వాత ఆ పాత్రలను మరొకరికి ఇచ్చారని తెలిసింది. అయితే ఆ పాత్రలను చేసిన వారు నాకంటే గొప్పగా చేసేవారైతే కాదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఒకప్పుడు ఎక్కువగా బాధపడేదాన్ని కానీ.. ఇప్పుడు పెద్దగా బాధపడటం లేదు’ అని ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనుభవాల గురించి అనసూయ చెప్పుకొచ్చింది. ఇక అనసూయని తప్పించిన ఆ నాలుగు సినిమాలు ఏమై ఉంటాయబ్బా అని సినీ ప్రియులు తెగ ఆలోచిస్తున్నారు.
మహేశ్ బాబుకు వదినగా రేణూ దేశాయ్!
5 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన రవి, లాస్య