బిగ్బాస్ రెండో సీజన్ రసవత్తరంగా నడుస్తుంది.షో మొదట్లో విమర్శలు వచ్చినప్పటికి వాటిని అధికమించి షోని సక్సెస్ చేయడంలో బిగ్బాస్ టీం సఫలం అయ్యారనే చెప్పాలి.ఇక షోలో జరిగే,గేమ్స్,టాస్క్స్ చాలా ఇంట్రస్ట్గా ఉండటంలో షోని ఎక్కువుగా అభిమానిస్తున్నారు.ఇక వారంతంలో న్యాచురల్ స్టార్ నాని తన స్టైల్లో అదరగొడుతున్నాడు.ఇక హౌస్మెట్స్ గురించి మాట్లాడుకుంటే…హౌస్ లో మిగిలిన కంటెస్టెంట్ లకు ఎవరికీ లేనంత ఫాలోయింగ్ కౌశల్ కి జనాల్లో పెరిగిపోయింది. అతడి పేరు మీద సోషల్ మీడియాలో ఆర్మీ కూడా తయారైంది.ఈ ఆర్మీ.. హౌస్ నుండి కౌశల్ ఎలిమినేట్ అవ్వకుండా చూడడం, కౌశల్ కి వ్యతిరేకంగా హౌస్ లో కామెంట్స్ చేసేవారిని ఎలిమినేట్ చేసే విషయాల్లో కీలకపాత్ర పోషిస్తోంది.
తాజాగా ఈ షోపై యాంకర్ రష్మి స్పందించింది. బిగ్ బాస్ విన్నర్ గా ఎవరు గెలుస్తారనే విషయాలపై కామెంట్స్ చేసింది. నందిని రాయ్, కౌశల్, గీతాలతో నాకు మంచి రిలేషన్ ఉంది. అయితే ఈ షో ఫాలో అవ్వాల్సిన అవసరం లేకుండానే హౌస్ లో ఏం జరిగిందో.. వెంటనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. కౌశల్ ఆర్మీని ట్విట్టర్ లో చూస్తుంటాను. ఇప్పుడు చూసినంత వరకు షో మొత్తం వన్ సైడెడ్ గా అయిపొయింది. బిగ్ బాస్ టైటిల్ గెలిచేది కౌశల్ అనే అనిపిస్తుంది. కౌశల్ ఆర్మీ చాలా స్ట్రాంగ్.కౌశల్ విన్నర్ కాకపోతే కౌశల్ ఆర్మీ రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేసేస్తారు అంటు చెప్పుకొచ్చింది రష్మీ.ఇక ఆమె హీరోయిన్గా నటించిన అంతకుమించి సినిమా రేపు థియోటర్లలో సందడి చేయనుంది.