ప్రముఖ యాంకర్ శ్యామల భర్త, బుల్లితెర నటుడు నర్సింహారెడ్డిని హైదరాబాద్లోని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ రాయదుర్గం పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఓ మహిళ నుంచి కోటి రూపాయలు అప్పుగా తీసుకున్న ఆయన తిరిగి చెల్లించకపోవడంతో బాధితురాలు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే నటుడు నర్సింహారెడ్డి ఆయనతో పాటు మరో మహిళను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
2017 నుంచి తన వద్ద విడతల వారీగా కోటి రూపాయల వరకు అప్పుగా తీసుకున్నాడని, తిరిగివ్వాలని అడిగితే తనను బెదిరించడంతో పాటు తనపై లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డాడని బాధితురాలు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అంతేకాదు తనతో డబ్బు విషయం సెటిల్ చేసుకోవాలని మరో మహిళతో తనపై వత్తిడి తీసుకు వస్తున్నాడని.. లేదంటే ఎంతకైనా తెగించే పరిస్థితి వస్తుందని బెదిరించారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయం సీరియస్ గా తీసుకొని రాయదుర్గం పోలీసులు నర్సింహారెడ్డితో పాటు మధ్యవర్తిగా వ్యవహరించిన మహిళను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ రిలీజ్ వాయిదా!