తెలుగమ్మాయి అంజలి.. తెలుగులో కంటే ముందు తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో కూడా సినిమాలు చేసి ఇక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుంది. అప్పుడే కేరీర్ మొదలు పెట్టిన ఈ భామ మీద రకరకల రూమార్స్ వచ్చాయి. వివాదాలతో కెరీర్ ని పాడుచేసుకుందనే కామెంట్స్ కూడా వినిపిస్తుంటాయి.
అయితే ఈ ముద్దుగుమ్మ పర్సనల్ లైఫ్ పై కూడా బానే రూమర్స్ ఉన్నాయి. ఓ డాక్టర్ ని వివాహం చేసుకోబోతుందనే వార్త ఎక్కువగానే వినిపించినా.. ఆ సంగతిన్ని ఖండించింది అంజలి. ఇప్పుడు ఓ హీరోతో తన రిలేషన్ గురించి ఒప్పేసుకుంది ఈ తెలుగమ్మాయి. మరి ఇంతకీ ఆ కుర్ర హీరో ఎవరో కాదు.. జర్నీ సినిమాఅలో అంజలికి జంటగా నటించిన తమిళ హీరో జై. జర్నీ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య అనుబంధం స్టార్ట్ అయ్యి.. ఆ తర్వాత బలపడింది.
ఇప్పుడు ఈ విషయం ‘దోశ విత్ లవ్’ కేంపెయిన్ తో బైటపడిపోయింది. మగలిన్ మట్టుం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తనే దోశలు వేసి.. విక్రమ ప్రభు సహా నలుగురికి ఛాలెంజ్ విసిరాడు సూర్య. విక్రమ్ ప్రభు ఈ దోశ ఛాలెంజ్ ను స్వీకరించడమే కాదు.. ఆ ఛాలెంజ్ ను యాక్టర్ జై కు విసిరాడు. ఇప్పుడు దోశ విత్ లవ్ అంటూ అంజలి కోసం దోశ వేసిన జై.. అధికారికంగా తమ ఇద్దరి మధ్య అనుబంధాన్ని బైట పెట్టేశాడు. మొత్తానికి జైతో లైఫ్ జర్నీకి జై కొట్టేసింది తెలుగు అమ్మాయి అంజలి.
Related
