Thursday, April 25, 2024
- Advertisement -

అఖండ తర్వాత బాలయ్య నటించే బ్యానర్ ఇదే..!

- Advertisement -

నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా వరుసగా యువ డైరెక్టర్లకు ఛాన్సులు ఇస్తున్నాడు. ఇప్పటికే బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ ఫిల్మ్ చేస్తున్నాడు. ఇదివరకు బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన సింహా, లెజెండ్ ఎంత ఘన విజయం సాధించాయో అందరికీ తెలిసిందే. హ్యాట్రిక్ ఫిల్మ్ గా వస్తున్న అఖండ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

ఇదివరకే విడుదలైన అఖండ టీజర్ కు అభిమానుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ 50 మిలియన్ లకు పైగా వ్యూస్ సాధించింది. కాగా అఖండ తర్వాత బాలకృష్ణ యువ దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. దీనికి సంబంధించి బాలకృష్ణ జన్మదినం రోజు అఫీషియల్ న్యూస్ వచ్చింది.

ఈ సినిమా పూర్తయిన తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం లో బాలకృష్ణ ఓ సినిమా చేయనున్నాడు. అయితే ఈ సినిమాను నిర్మించే వారు ఎవరు అనే విషయమై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. తాజాగా అనిల్ రావిపూడి సినిమాను ఏ బ్యానర్ పై నిర్మించేది తెలిసింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ వారు నిర్మించనున్నారని సమాచారం. ఈ బ్యానర్ పై ప్రస్తుతం నాని హీరోగా టక్ జగదీష్ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే బాలయ్య తో సినిమాను షైన్ స్క్రీన్ సంస్థ నిర్మిస్తున్నట్లు అఫీషియల్ గా ఇంకా ప్రకటించలేదు.

Also Read

థియేటర్ లో సినిమా చూడాలని ఉందా? అయితే అక్కడికి వెళ్లండి?

ఆర్ఆర్ఆర్ : అలియాభట్ కు కళ్లు చెదిరే రెమ్యునరేషన్..!

సౌత్​లో బన్నీ కొత్త రికార్డ్​.. విజయ్​ ని కూడా దాటేశాడే..!

నితిన్ మనసు మళ్లీ మార్చుకోవాల్సి వచ్చిందే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -