కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్తో థియేటర్లు మొత్తం బంద్ అయ్యాయి. ప్రేక్షకులకు వినోదం కరువైంది. ఓ వైపు కరోనా పీడిస్తుంటే ఎంటర్ టైయిన్ మెంట్ కావాల్సి వచ్చిందా? అనే వారు ఉన్నారు. కరోనా ఫస్ట్వేవ్ టైంలో కూడా థియేటర్లు మూతపడ్డాయి. అప్పుడు ఓటీటీలకు ఫుల్ గిరాకీ ఏర్పడింది. ఇక థియేటర్లకు కాలం చెల్లిపోయినట్టేనని.. ఇప్పుడంతా ఓటీటీల యుగమంటూ విశ్లేషణలు సాగాయి. కానీ ఆ తర్వాత థియేటర్లు రిలీజ్ కాగానే మళ్లీ జనం ఎగబడ్డారు. దీంతో తెలుగునాట, ఆ మాటకొస్తే.. మొత్తంగా మనదేశంలోనే థియేటర్లకు ఇంకా మార్కెట్ ఉందని రుజువైంది.
ప్రేక్షకులు ఓటీటీలో చూసేదానికంటే బిగ్ స్క్రీన్లో చూడటంలోనే ఎక్కువ థ్రిల్ ఫీల్ అవుతారని అర్థమైంది. థియేటర్లు లేనప్పుడు గత్యంతరం లేక ఓటీటీలను ఆశ్రయిస్తారు. అంతేతప్ప.. థియేటర్ల క్రేజ్ తగ్గలేదు. అయితే ఓటీటీలకు ప్రత్యేక ప్రేక్షకులు ఉన్నారు అది వేరే విషయం. మరోవైపు తెలుగు నాట సింగిల్ స్క్రీన్ థియేటర్ల శకం దాదాపు ముగిసినట్టే. ప్రస్తుతం మల్టిప్లెక్స్లు మాత్రమే ఎక్కవగా నడుస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ రావడంతో మళ్లీ థియేటర్లు క్లోజ్ అయ్యాయి.
Also Read: థర్డ్వేవ్.. చిన్నపిల్లల తల్లిదండ్రులూ బీకేర్ఫుల్..!
ప్రస్తుతం కరోనా కేసులు తగ్గాయి కాబట్టి .. త్వరలో థియేటర్ లు తెరుచుకొనే అవకాశం ఉంది. ఏపీలో ప్రస్తుతం ఓ థియేటర్ ఓపెన్ అయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అయ్యింది. అసలు ఏపీలో ఓపెన్ అయిన థియేటర్ ఏది? ఎక్కడ? తెలుసుకుందాం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జగదాంబ థియేటర్ ఇప్పుడు తెరుచుకున్నది. ఈ థియేటర్లో ప్రస్తుతం క్రాక్ సినిమా ఆడుతోంది.
ఏపీలో ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనలు సడలించిన విషయం తెలిసిందే. ఉదయం 6-12 గంటల మధ్య జనాలు బయట తిరిగేందుకు, వ్యాపారాలు నిర్వహించుకునేందుకు ఉన్న వెసులుబాటును ఇంకో రెండు గంటలు పొడిగించింది. దీంతో ఈ థియేటర్ను తెరిచారు. ప్రస్తుతం కొత్త సినిమాలు విడుదల చేసేందుకు ఎవరూ ముందుకు రారు. పైగా ప్రేక్షకులు కూడా సినిమాలు చూసే మూడ్లో లేరు. దీంతో చాలా చోట్ల ఇంకా థియేటర్లు తెరవలేదు. కానీ కరోనా సెకండ్వేవ్ తర్వాత తెరుచుకున్న మొదటి థియేటర్గా జగదాంబ థియేటర్ నిలిచింది.
Also Read: స్టార్ హీరోలూ.. రెమ్యూనరేషన్ కాస్త తగ్గించుకోండి బాబూ..