Wednesday, April 24, 2024
- Advertisement -

నితిన్ మనసు మళ్లీ మార్చుకోవాల్సి వచ్చిందే..!

- Advertisement -

కథల ఎంపిక విషయంలో నితిన్ తన కెరీర్లో పలుమార్లు నిర్ణయాలు మార్చుకున్నాడు. నితిన్ కెరీర్ ప్రారంభమైన మొదట్లో జయం, దిల్ వంటి లవ్ స్టోరీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. సాఫీగా సాగుతున్న తరుణంలో మాస్ ఇమేజ్ కోసం నితిన్ ట్రై చేశాడు. సిక్స్ ప్యాక్ పెంచి వరుసగా ఆ టైప్ సినిమాలు చేస్తూ వచ్చాడు. అయితే అవేమీ నితిన్ కు సరైన ఫలితం ఇవ్వలేదు. కొన్నేళ్ల పాటు వరుసగా డిజాస్టర్స్ ఎదుర్కొన్నాడు.

ఆ తర్వాత విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ ఇష్క్ మళ్లీ నితిన్ కి సూపర్ హిట్ ఇచ్చి పూర్వవైభవాన్ని తెచ్చింది. దీంతో ఇక వరుసగా ప్రేమకథలే చేస్తానని నితిన్ ప్రకటించాడు. ఆ తర్వాత నితిన్ చేసిన మరో ప్రేమ కథ గుండెజారి గల్లంతయ్యిందే కూడా ఘన విజయం సాధించింది. అప్పటి నుంచి వరుసగా ప్రేమకథలు చేస్తూ వచ్చాడు నితిన్.

Also Read: మెగాస్టార్ వర్సెస్ రెబల్ స్టార్..!

గత ఏడాది రంగ్ దే విడుదల సమయంలో నితిన్ ఇదే తన ఆఖరి లవ్ స్టోరీ అని ప్రకటించాడు. ఆ తర్వాత నితిన్ నటించిన చెక్ సినిమా విడుదలై అట్టర్ ప్లాప్ అయింది. దీంతో నితిన్ మరోసారి తన మనసు మార్చుకున్నట్లు టాక్. తనకు అచ్చొచ్చిన ప్రేమకథలే మళ్లీ చేయాలని నితిన్ భావిస్తున్నాడట. నితిన్ ప్రస్తుతం అంధాదూన్ రీమేక్ మ్యాస్ట్రో చేస్తున్నాడు. ఇందులో నితిన్ అంధుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నితిన్ చైతన్య దర్శకత్వంలో పవర్ పేట సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా రెండు భాగాలుగా తీయాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు నితిన్ ఆ సినిమాని పక్కన పెట్టి మంచి ప్రేమకథ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Also Read: హీరో చేంజ్.. మహేష్ కథలోకి పవన్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -