Saturday, April 20, 2024
- Advertisement -

కొత్త అవతారం ఎత్తిన బండ్ల గణేశ్!

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ గా ప్రస్థానం మొదలు పెట్టి తర్వాత స్టార్ ప్రొడ్యూసర్ గా మారారు బండ్ల గణేష్. పలు సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన ఆయన ప్రస్తుతం మళ్లీ నటనపై ఫోకస్ పెట్టారు. ఆ మద్య మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నవ్వులు పూయించారు బండ్ల గణేష్. జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కి పరమ భక్తుడైన బండ్ల గణేష్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ హల్ చల్ చేస్తారు.

నటుడు, నిర్మాత అయిన బండ్ల గణేష్ తన కుటుంబం అంటే ఎంతో అభిమానం చూపిస్తుంటారు. తన తల్లిదండ్రులంటే ఎంతో అభిమానం చూపిస్తుంటారు. ఇక గత యేడాది చాలామంది గడ్డాలూ మీసాలు పెంచేశారు. కారణం సెలూన్ కు వెళ్ళి కటింగ్ చేయించుకుంటే ఎక్కడ కరోనా సోకుతుందో అనే భయం. కాకపోతే కొంత మంది సెలబ్రెటీలు తమ ఇంట్లోనే బార్బర్ అవతారం ఎత్తి తమ వాళ్లకు కటింగ్, షేవింగ్ చేసిన వీడియోలు షేర్ చేసిన విషయం తెలిసిందే.

తాజాగా ఇదే పని బండ్ల గణేశ్ కూడా చేశాడు. ‘కరోనా భయంతో మా నాన్నకి ఈరోజు మా షాద్ నగర్ ఇంట్లో నేనే కటింగ్ చేశాను’ అంటూ తన తండ్రికి జుత్తు కత్తిరిస్తున్న వీడియోను గణేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఈయన బార్బర్ అవతారం ఎత్తడానికి వెనుక మరో కథ ఉందంటున్నారు.. ఇటీవల తమిళంలో వచ్చిన ‘మండేలా’ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఈ మూవీలో హీరో బార్బర్.

అయితే ఈ మూవీ హక్కులు తీసుకొని స్వయంగా హీరోగా నటించాలని భావించారట బండ్ల గణేష్.. కానీ అది కుదరలేదు.. దాని రైట్స్ వేరొకరు తీసుకుని సునీల్ తో తీయబోతున్నారని తెలుస్తోంది. ఇక సినిమాలో ఎలాగూ కుదరలేదు.. నిజ జీవితంలో అయినా ఆ కోరిక ఇలా తీర్చుకుని ఉండొచ్చు అని కొందరు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -