స్టార్ హీరో కాదు కానీ.. సోసో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. అతడికి విజయాలు వచ్చినా భారీగా రాలేదు. అయితే అతడు ప్రస్తుతం నటించిన సినిమా శాటిలైట్ హక్కులు మాత్రం భారీ స్థాయిలో కొనుగోలు చేయడం చూస్తుంటే వామ్మో ఏంటిది అనుకోవాల్సిందే. తండ్రి స్టార్ నిర్మాతగా పేరు పొందాడు. కానీ కొడుకు ఆ పేరును మాత్రం నిలబెట్టడానికి చాలానే కష్టపడుతున్నాడు. అంతే బెల్లంకొండ శ్రీనివాస్.
‘అల్లుడు శీను’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం తన సినిమా ‘సాక్ష్యం’ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సినిమాను శాటిలైట్ హక్కులను విక్రయించారు. ఈ హక్కుల మాత్రం భారీ రేటుకు అమ్ముడుపోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. తెలుగు, హిందీలో కలిపి సుమారు రూ.14 కోట్లకు ఈ సినిమా శాటిలైట్ హక్కులు అమ్ముడుపోయాయి. కరెక్ట్గా ఒక్క హిట్టు లేని శ్రీనుకు ఇంత మొత్తం అంటే చిన్న విషయం కాదు. అందులోనూ చేసిందే మూడు సినిమాలు. జయ జానకి నాయక పర్వాలేదు అనిపించుకుంది కానీ బడ్జెట్పరంగా చూసుకుంటే అది కూడా ఫెయిల్యూర్ కిందకే వస్తుంది. మరీ ఆ హీరోకు ఇంత మొత్తంలో ఎలా వచ్చిందబ్బా అని ప్రశ్నలు మొదలయ్యాయి.
ఈ హక్కులను జీ తెలుగు ఛానల్ కొన్నది. హిందీలో కూడా జీ టీవీ ఉండడంతో శ్రీను సినిమాకు భారీగా ముట్టజెప్పింది. బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన జయ జానకి నాయక సినిమా కూడా కొన్నది జీ చానల్. అయితే ఆ సినిమా సందర్భంగా చానల్కు మంచి టీఆర్పీ రేటు వచ్చింది. ఈ క్రమంలో అదే బాటన సాక్ష్యం హక్కులు కొనుగోలు చేశారని సమాచారం.
దీంతో పాటు శ్రీను పక్కన నటిస్తున్న పూజా హెగ్డే ఈ సినిమాలో అందాలు ఆరబోయడంతో ఆ రేటుకు చానల్ కొనుగోలు చేసింది. థ్రిల్లర్ సినిమాగా శ్రీవాస్ దర్శకత్వం చేస్తున్నాడు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్పై ఈ సినిమా భారీ బడ్జెట్తో రూపుదిద్దుకుంటుంది. మరీ ఈ సినిమా మంచిగా ఆడి నిర్మాతకు, హీరోకు కలిసి రావాలని కోరుకుందాం.