- Advertisement -
ఆదివారం ముగిసిన ఎపిసోడ్లో దీప్తి సునైనా బిగ్బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చేసింది.సోమవారం జరగనున్న ఎపిసోడ్లో ఈ వారం ఎలిమినేషన్కు నామినేషన్ ప్రక్రియ జరగనుంది.నామినేషన్లో భాగంగా బిగ్బాస్ హౌస్మెట్స్ ఒక్కోక్కరిని పిలిచి ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో, ఎందుకు ఎలిమినేట్ చేయలనుకుంటున్నారో కారణాలు చెప్పమని అడిగారు. ఇక ఈ వారం కూడా ఎక్కువ మంది కౌశల్నే టార్గెట్ చేసినట్లు అనిపిస్తుంది.
సామ్రాట్,గీతా మాధురి,గణేష్లు కౌశల్ పేరు చెప్పినట్లు ప్రొమోని చూస్తే తెలుస్తుంది.ఇక దీప్తి,శ్యామల,సామ్రాట్ను నామినేట్ చేసినట్లు అనిపిస్తుంది.ఇక తనీష్ మాత్రం నేను ఈ పేరు చెబితే చాలా మంది షాక్ అవ్వొచ్చు అంటూ మొదలుపెట్టాడు అంటే కచ్చితంగా కౌశల్ అయితే కాదు. మరి తనీష్ ఎవరిని నామినేట్ చేయబోతున్నాడో ఈ రోజు ఎపిసోడ్ లో తెలియనుంది!