Friday, May 17, 2024
- Advertisement -

బిగ్‌బాస్: కౌశల్‌ను టార్గెట్ చేసిన పూజా రామచంద్రన్

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్‌లో వివాదాల‌కు కొద‌వ లేద‌నే చెప్పాలి.షో మొద‌టి రోజు నుండి హోస్‌మెట్స్ మ‌ధ్య నిత్యం ఏదో విష‌యంలో గొడ‌వ‌లు జ‌రుగుతునే ఉన్నాయి.ఈ గొడ‌వ‌లు అన్నింటిలోను కౌశ‌ల్ టార్గెట్ చేస్తున్నారు హోస్‌మెట్స్‌.దీంతో షోలో అత‌ను ఒంట‌రి వాడిగా మిగిలిపోతున్నాడు. వైల్డ్‌కార్డు ద్వారా షోలోకి ఎంట్రీ ఇచ్చింది పూజా రామచంద్రన్. తాజాగా బిగ్ బాస్ మరో ఫిజికల్ టాస్క్ ను హౌస్ మేట్స్ కి ఇచ్చారు. ‘పురుషులకి, మహిళలకి మధ్య అంతిమ యుద్ధం’ అనే పేరుతి ఇచ్చిన ఈ టాస్క్ లో హౌస్ మేట్స్ పోటీ పడి మరీ పాల్గొన్నారు.

టాస్క్ లో భాగంగా పూజా రామచంద్రన్.. కౌశల్ పై విరుచుకుపడింది.’డోంట్ టాక్ కౌశల్’ అంటూ మండిపడింది. అంతేకాకుండా ‘శ్యామల మనం టాస్క్ ఆడుతోంది కౌశల్ తో కాదు నీకు అర్ధమవుతోందా..?’ అంటూ ఆమెపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.కౌశల్ ని మిగిలిన హౌస్ మేట్స్ అందరూ దూరం పెట్టినట్లుగా అనిపించినా.. పూజా మాత్రం అతడితో చాలా స్నేహంగా ఉంటూ వస్తోంది. నిన్నటి ఎపిసోడ్ టాస్క్ లో ఆమె సరిగ్గా రాణించలేకపోయిందనే అసహనాన్ని ఈ విధంగా వెళ్లగక్కిందని అంటున్నారు. మ‌రి బ‌య‌ట ఉన్న కౌశ‌ల్ ఆర్మీ ఆమెపై ఎలా స్పందిస్తారో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -