న్యాచురల్ స్టార్ నాని హోస్ట్గా వ్యవహరిస్తున్న బిగ్బాస్ తెలుగు రెండో సీజన్ రసవత్తరంగా జరుగుతుంది.మొదట్లో బిగ్బాస్ రెండో సీజన్పై విమర్శలు వచ్చినప్పటికి వాటిని అధికమించి షో ముందుకు నడిపించడంలో సక్సెస్ అయింది బిగ్బాస్ టీం.ఇక గత రెండు రోజులుగా హోస్లో కాల్ సెంటర్ టాస్క్ నడుస్తున్న సంగతి అందరికి తెలిసిందే. గురువారం జరిగిన ఎపిసోడ్లో కాల్ సెంటర్ ఉద్యోగిగా ఉన్న రోల్ రైడాతో నూతన్ నాయుడు ఫోన్ చేసి విసిగించే ప్రయత్నం చేశారు. అయితే ఇద్దరి మధ్య సీరియస్ డిస్కషన్ నడిచింది.
గల్లీ నుండి వచ్చి గల్లీకి మాత్రమే పరిమితం కావాలని అనుకుంటున్నావా అని నూతన్ నాయుడు అనడంతో.. గల్లీ వాళ్లు బిగ్ బాస్కి రాకూడదా? వెంటనే గల్లీ వాళ్లకు క్షమాపణ చెప్పాలన్నారు రోల్ రైడా. మరి మధ్య చిన్నపాటి వివాదం నడిచినట్లు అనిపించినా…అది టాస్క్లో భాగంగానే నడించింది.అయితే రోల్ రైడా ఫోన్ పెట్టేసినట్లు నాటకం ఆడి నూతన నాయుడుని బోల్తా కొట్టించాడు.ఇక రెండో కాలర్గా వచ్చిన దీప్తి నల్లమోతు దీప్తి సునైనాతో ఎక్కువ సేపు మాట్లాడిన అది పెద్ద ఆసక్తిగా అనిపించ లేదు.ఇక ‘కాల్ సెంటర్’ టాస్క్లో తనీష్ టీం 7 పాయింట్లు సాధించగా.. కౌశల్ టీం 10 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. ఈ సదర్భంగా విజేతగా నిలిచిన కౌశల్ టీంను అభినందించారు బిగ్ బాస్.
కౌశల్ తన గేమ్ ప్లాన్తోనే తమ టీంకు విజయం దక్కిందని అతని టీం సభ్యులు అభిప్రాయపడ్డారు.ఈ రోజు కెప్టెన్సీ టాస్క్ జరుగనుంది.కాల్ సెంటర్ టాస్క్లో గేమ్ బాగా ఆడిన కౌశల్,రోల్ రైడాలు కెప్టెన్సీ టాస్క్కు సెలెక్ట్ అయ్యారు.వీరి మధ్య ఈ రోజు(శుక్రవారం) కెప్టెన్సీ టాస్క్లో విజయం సాధించిన వారు,ఈ వారం హోస్కు కెప్టెన్గా వ్యవహరిస్తారు.