Friday, May 3, 2024
- Advertisement -

నాగ‌బాబుని ముంచేసిన సూర్య‌!

- Advertisement -

పాపం నాగ‌బాబుకు నిర్మాత‌గా క‌లిసి రావ‌డం లేదు.తీసిన ప్ర‌తి సినిమా ఫ్లాపే.చాలాకాలంగా నిర్మాతగా దూరంగా ఉన్న నాగ‌బాబుని తీసుకువ‌చ్చి మ‌రి త‌న సినిమాకు నిర్మాత‌గా పెట్టుకున్నాడు అల్లు అర్జున్‌.రాంచ‌ర‌ణ్ హీరోగా ఆరెంజ్ సినిమాను నిర్మించిన నాగ‌బాబు, ఆ సినిమా ఘోర పరాజ‌యంతో తీవ్రంగా న‌ష్టపోయాడు. దీంతో అప్పుల‌లో కురుకుపోయాడు నాగ‌బాబు.ఒక ద‌శ‌లో ఆత్మ‌హ‌త్య చేసుకొవడానికి కూడా ప్ర‌య‌త్నించాన‌ని ఆయ‌నే స్వ‌యంగా తెలిపారు.

అటువంటి స‌మ‌యంలోనే త‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌ను ఆర్ధికంగా ఆదుకున్నాడని తెలిపాడు నాగ‌బాబు.మ‌ళ్లీ ఇన్నాళ్లుకు సినిమాకు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించాడు.అయితే ఈ సినిమా కూడా ఫెయిల్ కావ‌డంతో నాగ‌బాబు తీవ్రంగా న‌ష్ట‌పోయాడు.అయితే ఈ సినిమాకు నాగ‌బాబుతో పాటు మ‌రో నిర్మాత లగడపాటి శ్రీధర్ కూడా ఉండ‌టంతో న‌ష్ట‌ల‌ను ఇద్ద‌రు భ‌రిస్తున్నార‌ని తెలుస్తుంది.సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీ మొత్తానికి ‘నా పేరు సూర్య’ చిత్రాన్ని కొనుగోలు చేయడం జరిగింది. 60 కోట్లకు పైగా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగింది.

కాని సినిమా లాంగ్‌ రన్‌లో కనీసం 25 నుండి 30 కోట్లను కూడా వసూళ్లు చేయడంలో విఫలం అయ్యింది.డిస్ట్రిబ్యూటర్లు 30 కోట్ల మేరకు నష్ట పోయినట్లుగా సమాచారం అందుతుంది. దాంతో డిస్ట్రిబ్యూటర్లు తమకు న్యాయం చేయాలని నిర్మాతలను అభ్యర్థిస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లకు లగడపాటి శ్రీధర్‌ అందుబాటులో లేకపోవడంతో అంతా కూడా నాగబాబుపై పడుతున్నారు. తమను ఆదుకోవాలంటూ నాగబాబును వారు వేడుకుంటున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -