బిగ్బాస్ రెండో సీజన్ ముగింపు దశకు వచ్చేసరికి షో మరింత రసవత్తరంగా మారింది.హౌస్లో ఇంకా మిగిలింది ఏడుగురు సభ్యులే కావడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారో?ఎవరు బిగ్బాస్ విన్నర్గా నిలుస్తారో అని అందరికి అతృతగా ఉంది.ఇక హౌస్లో ఉన్న ఏడుగురు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో ఎవరి గేమ్ను వారు ప్లాన్ చేసుకుంటున్నారు.బయట ఉన్న వారి అభిమానులు కూడా వారికి భారీ మద్దతు తెలుపుతు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.బిగ్బాస్ రెండో సీజన్లో స్ట్రాంగ్ కంటెస్ట్ అయిన కౌశల్కు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.
గత ఆదివారం కౌశల్ ఫాన్స్ హైదరాబాద్లో 2కె రన్ ఏర్పటు చేసి కౌశల్కు మద్దతు తెలిపారు.తాజాగా బిగ్బాస్ మరో హౌస్మెట్ అయిన తనీష్ ఫ్యాన్స్ కూడా వైజాగ్లో 5కె రన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.16వ తారీఖున ఆర్కె బీచ్ రోడ్డున ఈ 5కె రన్ నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తుంది.దీనికి సంబంధించిన ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు తనీష్ ఫ్యాన్స్.కౌశల్ ఆర్మీకి పోటీగా తనీష్ ఫ్యాన్స్ ఈ 5కె ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.అయితే తనీష్ కూడా ఓ ఆర్మీ ఉందని బయట జనాలకు ఇప్పటి వరకు తెలియకపోవడం గమనర్హం.బిగ్బాస్ రెండో సీజన్ మొదటి నుంచి తనీష్,కౌశల్ మధ్య నిత్యం ఏదో ఒక గొడవలు జరుగుతునే ఉన్నాయి.తాజాగా బయట ఉన్న వారి ఫ్యాన్స్ కూడా పోటా పోటీగా ర్యాలీలు చెపడుతున్నారు.మరి 2కె రన్,5కె రన్లు ఎటువంటి వివాదాలకు దారి తీస్తాయో చూడాలి.