Wednesday, May 1, 2024
- Advertisement -

టీవీ నటిపై దాడి

- Advertisement -

బిగ్ బాస్ షో లో పాల్గొనే టెలివిజన్ నటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు.

బిగ్ బాస్ సీజన్ 5లో పోటీదారుగా ఉన్న పూజా మిశ్రా ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయ్ పూర్ లోని ఓ ప్రేవేట్ హోటల్ లో వేకువ జామున నిద్రిస్తుండగా.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అసభ్యంగా ప్రవర్తించి పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించారని పూజా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఐపీసీ 354,379 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు  వైద్య పరీక్షల కోసం పూజాను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  హోటల్ లోని సీసీ టీవీ పుటేజ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాను ఉదయం 6 గంటలకు నిద్ర లేచి చూసేటప్పటికి తనపై కొన్ని చోట్ల గాయాలు కనిపించాయని పూజా చెబుతోంది. ఉదయ్ పూర్ డీఎస్పీ గోపాల్ సింగ్ భాటీ ఆధ్వర్యంలోని పోలీసు బృందంతోపాటు అంబమతా పోలీస్ ఉన్నతాధికారి జితేంద్ర అన్చాలియా కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -