Thursday, May 2, 2024
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ కి అత్తగా బాలీవుడ్ బ్యూటీ!

- Advertisement -

టాలీవుడ్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘అతడు’,‘ఖలేజా’ చిత్రాల్లో నటించాడు. అతడు బ్లాక్ బస్టర్ విజయం అందుకుంటే.. ఖలేజా మాత్రం కాస్త నిరాశ పరిచింది. వీరిద్దరి కాంబినేషన్ లో మరో చిత్రం వస్తుందని ఫ్యాన్స్ ఎంతగానో ఆశపడ్డారు.. కానీ అది మాత్రం కుదరలేదు. చాలా సంవత్సరాల తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది.

మహేశ్ బాబుకు ఇది 28వ సినిమా కావడం గమనార్హం. త్రివిక్రమ్ కుటుంబ నేపధ్యంలో సినిమాలను తెరకెక్కించడంలో దిట్ట. గతంలో ఆయన పవన్ కళ్యాన్ తో తీసిన ‘అత్తారింటికి దారేది’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రంలో పవన్ కి అత్తగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ నదియా నటించింది.

తివిక్రమ్ రూపొందించిన అజ్ఞాత‌వాసిలో ఖుష్బూ, అల వైకుంఠ‌పుర‌ములో ట‌బులు కీలక పాత్రలు పోషించారు. తాజాగా త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి కూడా ప్రధాన పాత్రలో నటించనున్నారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో శిల్పాశెట్టి మహేశ్ కు అత్తగా నటిస్తున్నారని సమాచారం.

ప్రముఖ నటి సుధాచంద్రన్ ఇంట విషాదం..

క‌రోనాతో కోలీవుడ్ నటుడు కన్నుమూత

ఆకట్టుకుంటున్న‘ముగ్గురు మొనగాళ్లు’ ఫస్ట్ లుక్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -