Friday, April 26, 2024
- Advertisement -

క‌రోనాతో కోలీవుడ్ నటుడు కన్నుమూత

- Advertisement -

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌లో ప్ర‌జ‌ల ప్రాణాల‌ను హ‌రించేస్తుంది. సినీ రంగానికి సంబంధించి చూస్తే కొంద‌రు సెల‌బ్రిటీలు ఇప్ప‌టికే ప‌లువురు క‌రోనా కార‌ణంగా కన్నుమూశారు. మరికొందరు ప్రముఖులు వారి ఆప్తులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. గ‌త ఏడాది ప్ర‌ముఖుల మ‌ర‌ణాలు త‌క్కువ‌గా ఉండగా, ఈ ఏడాది మాత్రం రోజుకు ఇద్ద‌రు లేదా ముగ్గురు క‌రోనాతో లేదంటే అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో క‌న్నుమూస్తున్నారు. 

సోమవారం నాడు కరోనా కారణంగా తమిళ నటుడు నితీశ్‌ వీరా(45) కన్నుమూశాడు. అసురన్‌ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నితీశ్‌ ‘పేరరుసు’, ‘వెన్నిల కబడి కుళు’, ‘పుదు పేట్టై’ వంటి పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించాడు.

ఈ మద్యనే విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న లాభంతో పాటు నీరో చిత్రంలోను న‌టించారు. మరోవైపు ‘నీరో’ అనే సినిమాలోనూ కనిపించనున్నాడు. ఇంతలోనే కరోనా ఆయనను కబళించడంతో చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నితీశ్ అకాల మ‌ర‌ణంపై సినీ ప‌రిశ్ర‌మ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసింది.

గొప్ప మనసు చాటుకున్న నవీన్ పోలిశెట్టి… అభిమానికి బిగ్ సర్ప్రైజ్

దేశంలో త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా..

లాక్‌డౌన్‌లో బుల్లితెర నటులు ఏం చేస్తున్నారో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -