సినీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చి ఏడాదిన్నరయ్యింది. ఆ సినిమా తర్వాత రెండో సినిమాను ప్రారంభించడానికి చాలాకాలం పట్టింది. ప్రస్తుతం ఒక కొలిచ్చి ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిరంజీవి సినిమా. ‘సైరా నరసింహారెడ్డి’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో సుమారు రూ.2 కోట్లతో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఓ సెట్లో జరుగుతోంది.
చిరంజీవి, నయనతారలపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. సురేందర్రెడ్డి దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమాకు రామ్చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంగీత దర్శకుడి విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఏఆర్ రహమన్ మొదలుకొని తమన్, డీఎస్పీ, కీరవాణి ఇలా అందరి పేర్లు వినిపించాయి. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ పని చేస్తాడని పుకార్లు వినిపిస్తున్నాయి. ఆయనే అమిత్. అమిత్ బాలీవుడ్లో ‘క్వీన్’, ‘కాయ్పోచి’, ‘ఉడ్తా పంజాబ్’, ‘డియర్ జిందగీ’ సినిమాలకు సంగీతం అందించాడు. ప్రస్తుతం అమిత్ ఈ సినిమాకు ఎంపికయ్యాడని సమాచారం. అయితే ఈ విషయమై ‘సైరా’ చిత్రబృందం ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.