Monday, May 13, 2024
- Advertisement -

రామ్ గోపాల్ వర్మ రూపొందించబోయే సినిమాలో చంద్రబాబే విలనా….?

- Advertisement -

సినీ రంగంలో వివాదాల‌కు పెట్టింది పేరు రాంగోపాల్ వ‌ర్మ‌.ఆయ‌న తీసిన బయేపిక్ చిత్రాల‌న్ని కూడా విడుద‌ల‌కు ముందు వివాదాస్ప‌ద‌మే. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌ను రెండు బాగాలుగా తీస్తాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.దీనిపై అంద‌రికి ఆస‌క్తి తెల‌కొంది.అయితే ఇప్పుడంతా చివ‌రి రోజుల్లో ఎన్టీఆర్ కు జ‌రిగిన అవ‌మానాలపైనే చ‌ర్చ‌జ‌రుగుతోంది.
ప్ర‌ధానంగా ఎన్టీఆర్ రాజకీయ వ్యక్తిగత జీవితాల్లో ఉన్న కొన్ని సంఘటనలతో ప్రస్తుత సీఎం చంద్రబాబుకు సంబంధాలు ఉండడంతో వాటిని ఎంతవరకు ఈ సినిమాల్లో ప్రస్తావిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. నిజానికి ఎన్టీఆర్ తనయుడు హీరో బాలయ్య ఈ జీవిత చరిత్ర సినిమాలో నటిస్తున్నారు. అయితే… అది చంద్రబాబు – బాలయ్య ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఉంటుంది కాబట్టి వారికి అనుకూలంగానే ఆ సినిమా ఉండొచ్చని భావిస్తున్నారు.
రీసెంటుగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఎన్టీఆర్ పై సినిమా తీస్తానని ప్రకటించడంతో టీడీపీలో టెన్షన్ మొదలైంది. అసలే వర్మ… అందులో ఏం చూపిస్తాడో అని తెగ టెన్షన్ పడుతున్నారట. వారి టెన్షన్ కు తగ్గట్టుగానే వైసీపీ నేత జోగి రమేశ్ మరో బాంబు పేల్చారు.
రామ్ గోపాల్ వర్మ రూపొందించబోయే సినిమాలో చంద్రబాబే విలన్ అని జోగి రమేష్ అన్నారు. ఎన్టీఆర్ పై చెప్పులు – రాళ్లు వేయించి – అవమానించి ఆయన మరణానికి కారణమైంది చంద్రబాబే అన్నారు. ఇవన్నీ ఆ సినిమాలో చూపించాలని ప్రజలకు నిజాలు తెలియజేయాలన్నారు. ఇదంతా ఎలా ఉన్నా వర్మ ఈ సినిమా తీస్తే మాత్రం చంద్రబాబు బండారం ఈతరానికి తెలిసిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.బాబు ట్రిగ‌ర్ వ‌ర్మ‌చేతిలో ఉన్న‌ట్లేన‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -