- Advertisement -
హీరోయిన్ అమలాపాల్పై పుణే పోలీసులు చార్జ్ షీట్ నమోదు చేసినట్లు తెలుస్తుంది.అమలాపాల్ నకిలీ అడ్రెస్తో తన కారుని రిజిస్టర్ చేయించి ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టిన సంగతి తెలిసిందే.ఈ వ్యవహరం బయటికి రావడంతో ఆమె కోర్టులో లొంగిపోవడం, ఆ వెంటనే బెయిల్పై బయటకు రావడం అన్నీ చకా చకా జరిగిపోయ్యాయి.అయితే తాజాగా ఈ కేసులో ఆమెపై చార్జ్ షీట్ నమోదు చేయాలని కేరళ గవర్నమెంట్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
రూ.20 లక్షల పన్నుని కట్టాల్సి వస్తుందని అమలాపాల్ ఫేక్ అడ్రెస్ తో తన కారుని పుణే పేరుతో రిజిస్టర్ చేయించుకుంది. ఈ వ్యవహరం బయటికి రావడంతో పుణే పోలీసులు అమలాపాల్పై కేసు నమోదు చేశారు.20 లక్షలకు కక్కుర్తి పడితే ఇన్ని ఇబ్బందులు ఉంటాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.