- Advertisement -
కాస్టింగ్ కౌచ్ ఈ పదం లేని ఇండస్రీ లేదంటే అతిశేయోక్తి కాదు.ఆడవాళ్లను లైంగికంగా వేధించడంలో పరిపాటిగా మారింది.తెలుగు వివాస్పద నటి శ్రీరెడ్డి ఈ కాస్టింగ్ కౌచ్ గురంచి చేసిన రచ్చ అంత ఇంత కాదు.ఇప్పుడు తాజాగా బాలీవుడ్లో తనుశ్రీదత్తా పలువురు తారలు తనను లైంగికంగా వేధించారంటూ బయటకి వచ్చి కామెంట్లు చేస్తోంది.
తాజాగా సీనియర్ నటి గాయత్రి సాయి ఓ జర్నలిస్ట్ తనను వేధిస్తున్నాడని, లొంగకపోతే పరువు తీస్తానని బెదిరిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. స్వామి అనే జర్నలిస్ట్ తనను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని, రెండేళ్లుగా సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా వేధిస్తున్నాడని కన్నీటి పర్యంతమైంది.తనను శారీరకంగా తాకుతూ.. కోరిక తీర్చమని అడుగుతున్నాడని ఆరోపణలు చేసింది.